భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ను లాంచ్ చేసింది. Vida V1 ప్లస్, Vida V1 ప్రో పేరుతో వీటిని కంపెనీ విడుదల చేసింది. Vida V1 ప్లస్ ధర రూ. 1.45 లక్షలు కాగా.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 140కిలోమీటర్ల పైనే ప్రయాణిస్తుంది. Vida V1 ప్రో ధర రూ. 1.59 లక్షలు కాగా.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 165కిలోమీటర్ల పైనే ప్రయాణిస్తుంది. అక్టోబర్ 10 నుంచి ఈ-స్కూటర్ బుకింగ్ ప్రారంభం కానుంది.
కంపెనీ ఈ ఉత్పత్తిని ముందుగా లాంచ్ చేయాలని భావించింది. అయితే.. “మేము దానిని సరిగ్గా పొందాల్సి వచ్చింది” అని కంపెనీ ఛైర్మన్ పవన్ ముంజాల్ జైపూర్లో జరిగిన లాంచ్ ఈవెంట్లో ఆయన తెలిపారు. ఈ స్కూటర్లు మొదట న్యూఢిల్లీ, జైపూర్, బెంగళూరులలో ప్రారంభించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్డెలివరీలు డిసెంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కానున్నాయి. Hero MotoCorp కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం Vida V1.. Ola S1 Pro, Ather 450X Gen3, బజాజ్ చేతక్, TVS iQubeలకు పోటీగా ఉండనుంది. Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రారంభించడమే కాకుండా.. హీరో మోటోకార్ప్ తన విడా ఛార్జింగ్ నెట్వర్క్ను వినియోగదారుల కోసం శుక్రవారం ఆవిష్కరించింది.
“డిసెంబర్లో మరో ఎనిమిది నగరాల్లో బుకింగ్లను ప్రారంభిస్తాం. తరువాత మరిన్ని నగరాల్లో బుకింగ్లను ప్రారంభించనున్నాం. మేము ఉత్పత్తిని పెంచినప్పుడు.. మేము మరిన్ని నగరాల్లో ప్రారంభిస్తాము” అని ఛైర్మన్ పవన్ ముంజాల్ తెలిపాడు. Hero MotoCorp వాహన సంస్థ 16 నుండి 18 నెలల మధ్య కొనుగోలు విలువలో 70% వద్ద వాహన కొనుగోలు హామీతో బై-బ్యాక్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది.