ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. దాంతో వాహన తయారీ సంస్థలు ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలనే మార్కెట్లోకి విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇప్పటికే మార్కెట్ లోకి చాలా రకాల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అయిన విషయం తెలిసిందే. కాగా గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే దిశగా ఒక ఉత్తేజకరమైన చర్యలో ఎస్ఏఆర్ గ్రూప్నకు సంబంధించిన ఈ-మొబిలిటీ విభాగం, లెక్ట్రిక్స్ తమ శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ దాని పనితీరు, సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ప్రత్యేక తగ్గింపు ఆఫర్తో ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో లెక్ట్రిక్స్ ఈవీ స్కూటర్ పై ఉన్న ఆఫర్ విషయానికి వస్తే.. లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 పై రూ. 5,000 పరిమిత సమయ తగ్గింపును ప్రకటించింది. బ్యాటరీ లేని వెర్షన్ కోసం దాని ధరను రూ. 49,999 కి తగ్గించింది. సాధారణంగా ఈ స్కూటర్ ప్రామాణిక ధర రూ.75,999 గా ఉంది. కానీ కస్టమర్లు బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్ ను ఎంచుకుంటే తగ్గింపు ధర వర్తిస్తుంది. అంటే బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్ ని ఎంచుకునే వారికి, ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.49,999 కి అందుబాటులో ఉంది.
బ్యాటరీకి అదనంగా నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోడల్ బ్యాటరీపై జీవితకాల వారెంటీ కూడా ఉంటుందట. లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0పై లెక్ట్రిక్స్ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీల సమగ్ర వారంటీని అందిస్తుంది. 50 కిమీల రోజువారీ వినియోగంతో ఈ వారంటీ దాదాపు 20 నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. అధిక వినియోగం కోసం సర్దుబాట్లు చేయబడతాయి. ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసిన 2-3 వారాల్లో డెలివరీ చేస్తామని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా ఈ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు 100 కిమీ మైలేజ్ అందిస్తుంది. అలాగే 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఈ స్కూటర్ కేవలం 9 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ 6 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.