Site icon HashtagU Telugu

YCP Samajika Sadhikara Bus Yatra : విజయవంతంగా ఏడురోజుకు చేరిన సామాజిక సాధికార యాత్ర

Samajika Sadhikara Bus Yatra

Samajika Sadhikara Bus Yatra

రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర (YCP Samajika Sadhikara Bus Yatra) విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర కు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు , అభిమానులు బ్రహ్మ రథంపడుతున్నారు. తొలి విడతలో మూడు ప్రాంతాల్లోని 39 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. సామాజిక సాధికార యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌ (CM Jagan) చేసిన మేలును వివరిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని చెప్పేందుకు ఈ యాత్రను చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

నేడు ఏడురోజు కు చేరింది ఈ యాత్ర. శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మవరం టౌన్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీ జరపనున్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు ఈ సభలో పాల్గొనున్నారు.

ఎల్లుండి న‌వంబ‌ర్ 6 – గాజువాక, రాజ‌మండ్రి రూర‌ల్, మార్కాపురం, న‌వంబ‌ర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగ‌డ్డ , న‌వంబ‌ర్ 8 – సాలూరు, పాల‌కొల్లు, నెల్లూరు రూర‌ల్, న‌వంబ‌ర్ 9 – అన‌కాప‌ల్లి, పామ‌ర్రు, తంబ‌ళ్లప‌ల్లె లో యాత్ర కొనసాగనుంది.

Read Also : Telangana Elections 2023 : కాంగ్రెస్ కే ‘జై’ అంటున్న చిన్న పార్టీలు..మరి ఫలితం ఎలా ఉంటుందో..?