Jagan Ane Nenu: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్డౌన్ను తెలుపుతూ తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘జగన్ అనే నేను’ అనే టైటిల్స్తో బోర్డును పార్టీ నాయకత్వం ఆవిష్కరించింది. వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నేతలు పాల్గొన్నారు.
పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ మద్దతుదారులు జెండా ఎగురవేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు భారీ కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
పార్టీని ఉద్దేశించి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికార దాహం ఉన్న నాయకుడని, ఆయన ప్రజలపై ఏనాడూ ప్రేమను కురిపించలేదన్నారు. వైఎస్ జగన్ నాయుడులా కాకుండా ప్రజల సంక్షేమంపై దృష్టి సారించి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని అన్నారు. భవిష్యత్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించేందుకు వైఎస్ జగన్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Also Read: KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై కేటీఆర్ ఆవేదన, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన