బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట

గత ప్రభుత్వంలో తాడేపల్లి వేదికగా జరిగిన గూఢచారుల సమావేశాలు, కక్ష సాధింపు చర్యల వెనుక ఉన్న అసలు కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

  • బాబు పై వరుసగా కేసుల కొట్టివేత
  • వైసీపీ హయాంలో బాబు పై ఇష్టానుసారంగా కేసులు నమోదు
  • చంద్రబాబు కు బిగ్ రిలీఫ్

    గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కనీస ఆధారాలు లేకుండా, కేవలం రోజువారీ ప్రభుత్వ నిర్వహణ పనులను సాకుగా చూపిస్తూ కేసులు నమోదు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుల్లో కీలకమైన ‘మనీ ట్రయల్’ (డబ్బు ఎక్కడికి వెళ్లిందనే ఆధారాలు) ఒక్క రూపాయి కూడా నిరూపించలేకపోవడమే కాకుండా, ఫిర్యాదు చేసిన వారు కూడా ఇప్పుడు సరైన ఆధారాలు చూపలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో న్యాయస్థానాల్లో ఈ కేసులు నిలబడటం లేదు, ఇది వైసీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.

Chandrababu

వైసీపీ వ్యూహం మొదటి నుంచి వ్యవస్థలపై ఒత్తిడి తీసుకురావడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న సోషల్ మీడియా మరియు అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ, న్యాయవ్యవస్థపై బురద చల్లడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఒకవేళ తీర్పులు తమకు వ్యతిరేకముగా వస్తే, పైకోర్టులకు వెళ్లి న్యాయపరంగా పోరాడాలి కానీ, ప్రెస్‌క్లబ్బుల వేదికగా న్యాయ నిపుణులు గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం వ్యవస్థలను ప్రభావితం చేయడమేనని అర్థమవుతోంది. ఇలాంటి వైఖరి వల్ల కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగబద్ధమైన సంస్థల ప్రతిష్టను మసకబారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇకనైనా తప్పుడు కేసులు పెట్టిన, మరియు దానికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజల నుండి డిమాండ్ వస్తోంది. గత ప్రభుత్వంలో తాడేపల్లి వేదికగా జరిగిన గూఢచారుల సమావేశాలు, కక్ష సాధింపు చర్యల వెనుక ఉన్న అసలు కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కేవలం న్యాయ ప్రక్రియకే పరిమితం కాకుండా, తప్పుడు కేసులతో వ్యవస్థలను తప్పుదోవ పట్టించిన వారిని కూడా టార్గెట్ చేస్తేనే భవిష్యత్తులో ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు అడ్డుకట్ట పడుతుంది. వ్యవస్థలపై నిందలేసే సంస్కృతి ఆగాలంటే బాధ్యులకు సరైన శిక్ష పడాల్సిందే.

  Last Updated: 26 Dec 2025, 01:41 PM IST