Site icon HashtagU Telugu

YS Sharmila : కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేసిందని ఆరోపించారు. “పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది” అని ఆమె పేర్కొన్నారు. ఈ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని, ఇది ప్రాణాలతో పోరాటం చేస్తున్న పేద ప్రజల కోసం ఒక సంజీవని పథకం అని ఆమె చెప్పారు.

 
Regional Ring Railway Line: సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం.. రీజినల్ రింగు రైల్వే లైన్ ప్రతిపాదనలు..
 

షర్మిల మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం రూ. 3 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, వైద్య సేవలు నిలిచే వరకు చూస్తున్నదంటే, ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక కుట్ర అని మాత్రమే చూడవచ్చు” అని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని, ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని ఆమె విమర్శించారు.

ఆమె ఉద్దేశ్యం ప్రకారం, “కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడుతూ ప్రజల ఆరోగ్యంపై చెలగాటం ఆడడం సరికాదు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి, వదిలించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు.

“ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తోంది. గత ప్రభుత్వానిచ్చిన పెండింగ్ బకాయిలను ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఆసుపత్రి యాజమాన్యాలను చర్చలకు పిలవడం, రూ. 3 వేల కోట్ల బకాయిలను తక్షణం విడుదల చేయడం, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించడం , పథకానికి ఏ లోటూ రాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత” అని షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ వేదికగా స్పందించారు.

Tremors In India : నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం.. బిహార్‌, ఢిల్లీ, బెంగాల్‌‌లో ప్రకంపనలు