Site icon HashtagU Telugu

YS Sharmila: ప్రభాస్ తో రిలేషన్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

Ys Sharmila Comments

Ys Sharmila Comments

ప్రభాస్‌తో సంబంధం పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో కలిసి ప్రభాస్ తో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన షర్మిల, జగన్ మోహన్ రెడ్డి మరియు ఆదానీ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు:

‘‘నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగినట్లు చెప్పి, జగన్ నాకు ఒక్క ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో చూపించారు. మీకు ఈ విషయం తెలుసుగా, మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు గాడిదలు కాశారా? విచారణ ఎందుకు చేయలేదు? ప్రభాస్ తో నా సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా? మా పిల్లల మీద ఒట్టు వేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు. జగన్ ఏయ్ ఈ ప్రచారం చేయించారు. నా వీడియో చూపించి ఆయన సానుభూతి పొందాలని అనుకున్నారు. జగన్ తన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు, నాన్న పేరు సీబీఐ చార్జీ షీట్ లో పెడతారు, మల్లి తనపై దుష్ప్రచారం చేయించుకుంటారు’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ బాటలో మీరు నడవొద్దు:

‘‘జగన్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవకూడదు. ఇక నుంచి ఏపీ నుండి అదానీకి ప్రాజెక్టులు ఇవ్వొద్దు. మోదీ మరియు అదానీ వేర్వేరు కాదు. మోదీ అదానీకి రక్షణ కల్పిస్తున్నారు. అదానీ మోదీకి డబ్బులు ఇస్తున్నారు. సెబీ చీఫ్ కూడా అదానీ చేతిలో ఉన్నారు. అదానీపై అమెరికాలో కేసు నమోదవడం జరిగింది, కానీ భారతదేశంలో అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని చూసి, మోదీ మరియు అదానీ మధ్య ఉన్న బంధం అర్థం అవుతుంది. పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఇంత డబ్బులు సంపాదించడం ఎలా సాధ్యమో? అదానీ వ్యవహారం మోదీకి మరియు దేశానికి అవమానం.

కాంగ్రెస్ అడిగే ఒక్క ప్రశ్నకి అయినా మోదీ సమాధానం చెప్పాలి. మోదీ అదానీని అమెరికాకు అప్పగిస్తారా? మోదీ అండతోనే దేశంలో ఇంత అవినీతి జరుగుతోంది. జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూఎస్‌ఏ గౌతమ్ అదానీపై అభియోగాలు వేసింది. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చింది. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆగస్టు 2021లో జగన్ కు ముడుపులు అందినట్టు తెలుస్తోంది. పవర్ సప్లైలో అదానీ జగన్ను కలిసినప్పుడు, ‘‘మీకు కావాల్సినది అందిస్తామంటూ’’ ప్రామిస్ చేశారు’’ అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు.

మోదికి జగన్ దత్తపుత్రుడు:

‘‘అదానీతో జగన్ కి కొన్ని కీలక విషయాల్లో డిస్కస్ జరిగాయని తెలుస్తోంది. జగన్ మోదీకి దత్త పుత్రుడే. ఆయన మీద విచారణ చేయిస్తారా? అదానీపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కోరుతున్నాను. ఒక సహచరిగా రేవంత్ కు విజ్ఞప్తి చేస్తున్నాను… అదానీతో బిజినెస్ చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డినీ ఎత్తి చూపకపోతే, నా ఆస్తి నాకు ఇస్తానంటున్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నేను ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్… ఇలాంటివి నేను మాట్లాడకుండా ఉంటే ఎలా?’’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.