Jagan’s new look: జగనన్న న్యూ లుక్ అదిరింది!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు.

  • Written By:
  • Updated On - August 26, 2022 / 01:53 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సీఎం వైఎస్‌ జగన్‌ కళ్లద్దాలు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పార్లే సంస్థ ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో అధికారులు బీచ్‌ పరిరక్షణపై ఎంఓయూపై సంతకాలు చేశారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.