Memanta Siddham Bus Yatra: వైఎస్ జగన్ రేపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగమైన జనసేన, టీడీపీ మరియు వైసీపీ మధ్య పోరు చూస్తుంటే కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. అంతిమంగా విజయమే లక్ష్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Memanta Siddham Bus Yatra: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగమైన జనసేన, టీడీపీ మరియు వైసీపీ మధ్య పోరు చూస్తుంటే కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. అంతిమంగా విజయమే లక్ష్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారాన్ని భుజానేసుకున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. రెండ్రోజుల పాటు అనారోగ్యానికి గురైన పవన్ నేటితో మళ్ళీ ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. ఇక వైసీపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. వైఎస్ జగన్ ” మేమంత సిద్దం ” పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. రేపటి జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ను తాజాగా విడుదల చేశారు.

ఏప్రిల్ 6వ తేదీ శనివారం జరగనున్న ” మేమంత సిద్దం ” బస్సు యాత్ర 9వ రోజు షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆవిష్కరించారు. ఈ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతారెడ్డి పాలెం నుంచి ఉదయం 9 గంటలకు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణం కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, మరియు గోవరం మీదుగా తీసుకువెళుతుంది, RSR ఇంటర్నేషనల్ స్కూల్‌కు చేరుకున్న తర్వాత సీఎం జగన్ తో పాటు ఇతర నేతలు లంచ్ బ్రేక్ తీసుకుంటారు.

We’re now on WhatsAppClick to Join

తదనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వైపుగా వెళ్తారు, అక్కడ ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు ప్రసంగిస్తారు. సభ ముగింపు అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా యాత్ర కొనసాగి రాత్రి జువ్విగుంట క్రాస్ వద్ద ముగుస్తుంది.

Also Read: AP : జగన్, అవినాష్ లను ఓడించాలని షర్మిల పిలుపు