YS Jagan: పార్టీపై దృష్టి పెట్టిన జగన్, మూడు జిల్లాలకు అధ్యక్షుల నియామకం

YS Jagan: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు

Published By: HashtagU Telugu Desk
Ys Jagan

Ys Jagan

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీపై దృష్టి పెట్టారు. పార్టీ సంస్థాగత మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో బలపరచడానికి చర్యలకు సిద్ధమయ్యారు జగన్ (ys jagan). గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి జిల్లా స్థాయిలో నేతలను ఎంపిక చేయనున్నారు. అందులో భాగంగా ఈ రోజు వైఎస్ జగన్ పార్థి నేతలతో కీలక భేటీ నిర్వహించారు.

ప్రస్తుతం రాజకీయ పరిణామాలను విశ్లేషించడానికి మరియు జిల్లా అధ్యక్షుల ఎంపికను ఖరారు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(ysrcp) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలను ఏర్పాటు చేశారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో రెడ్డి సమావేశమయ్యారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షుల గురించి చర్చించారు. ఈ జిల్లాలకు కొత్త అద్యక్షుల వివరాలు ఈ రోజే ప్రకటించనున్నారు. రాబోయే రాజకీయ సవాళ్లకు ముందు తన సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి జగన్ దృష్టి పెట్టారు.

కాగా గత వారం రోజులుగా రాష్ట్రంలో తిరుపతి లడ్డు వివాదం నడుస్తుంది. ఈ వివాదంపై అధికార పార్టీ, ప్రతిపక్షంపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.ఈ వివాదాన్ని తేల్చేందుకు వైసీపీ సిబిఐ దర్యాప్తుకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా పార్టీ సంస్థాగత మార్పులో భాగంగా ఈ రోజు వైఎస్ జగన్ మూడు జిల్లాల నేతలతో భేటీ నిర్వహించారు.

Also Read: YS Jagan : లడ్డూ వివాదం..కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్

  Last Updated: 25 Sep 2024, 05:11 PM IST