Somireddy Chandramohan Reddy : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (Former CM YS Jagan Mohan Reddy) అసెంబ్లీకి హాజరుకావడం పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ అసెంబ్లీకి రావడానికి అనర్హత వేటు భయమే కారణమని అన్నారు. “ఈ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వస్తారా లేదా అన్ని రోజులు రాేవాలా అనేది తెలియదు,” అని ఆయన అన్నారు. అలాగే, ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వగలరో అనే ప్రశ్న కూడా ఆయన పత్రికా సమావేశంలో వ్యక్తం చేశారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, “జగన్ కైళ్ల మీద పడి, మోడీకి అనుకూలంగా వ్యవహరించేవారు. అలవాటుతోనే ఆయన కాళ్ల మీద పడి, అసెంబ్లీకి వెళ్లేందుకు చట్టంలో మార్పు చేయించి, ఈరోజు సభకు వచ్చారు,” అని ఎద్దేవా చేశారు. ఆయన భావన ప్రకారం, జగన్ తన పాలనా సమయంలో జరిగిన వివాదాస్పద వ్యవహారాలన్నీ బయటకు రాకుండా, భయంతోనే అసెంబ్లీకి హాజరై ఉన్నారు.
SLBC Incident : టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ విధానం
ఇక, ఈ రోజు (సోమవారం) అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నాయకత్వం హాజరుకావాలని నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా, పార్టీలో శాసనసభ సమావేశం నిర్వహించి తదనంతర కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా, వైసీపీ అధినేత జగన్ గతంలో ప్రకటించినట్లుగా, “ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని” చెప్పారు. అయితే, 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని భయంతోనే వైసీపీ నాయకులు ప్రస్తుతం సభకు హాజరయ్యారు.
ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 20 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం, అసెంబ్లీకి వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించబడింది. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసే వ్యక్తులు నేరుగా సీఎంవోకే వెళ్లాలని, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై తగిన ప్రాధాన్యత ఉన్న నిర్ణయాలు త్వరలో వెలువడనున్నాయి.
Shashi Tharoor: శశి థరూర్ ఏం చేయబోతున్నారు ? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ?