Site icon HashtagU Telugu

YCP Leaders : అరెస్టుల భయంతో హాస్పటల్ లలో చేరుతున్న వైసీపీ నేతలు..?

Peddireddy Nani

Peddireddy Nani

ఏపీలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతున్న వేళ వైసీపీ నేతల (YCP Leaders) అనారోగ్యం (Health Problems)హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కొంతమంది నేతలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. గ్యాస్ట్రిక్, గుండె సంబంధిత సమస్యలతో కొడాలి నాని (Kodali Nani) ఆసుపత్రిలో చేరడం, భూగనుల వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్జరీ చేయించుకోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఆరోగ్య సమస్యలు సహజమా? లేకా న్యాయపరమైన చర్యల నుండి తప్పించుకునే కొత్త వ్యూహమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కేసుల మధ్య ఆసుపత్రులకి పాల్పడిన నేతలు

గుడివాడలో కొడాలి నాని పేరు వెలువడిన కేసుల నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరడం ఆసక్తికరంగా మారింది. తొలుత గుండెనొప్పి అంటూ ప్రచారం చేసినా, తర్వాత పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు తమ ఆరోగ్య సమస్యలను చూపిస్తూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం గమనార్హం. ముఖ్యంగా లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి చేయికి సర్జరీ చేసుకున్న విషయం కోర్టులో తన అనారోగ్యాన్ని రుజువు చేసుకోవడానికి ఉపయోగించుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీపీ నేతలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరుతున్న విషయం సహజమా? లేక అరెస్టుల భయంతో ముందస్తు చర్యలుగా మారిందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకే సమయంలో పలువురు నేతలు ఆసుపత్రులను ఆశ్రయించడం వెనుక వ్యూహం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. న్యాయపరమైన చర్యలను ఎదుర్కొనే సాహసం చేయకుండా, ఆరోగ్య సమస్యల్ని ఆవరణగా చూపించి తాము కష్టాల్లో ఉన్నామని నిరూపించుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణ సాగుతోంది. ఏది నిజమో సమయం తెలియజేస్తుంది కానీ, ప్రస్తుతం వైసీపీ నేతల ఆరోగ్య సమస్యలు, న్యాయ వ్యవస్థను తప్పించుకునే వ్యూహాలుగా మారాయని చెప్పవచ్చు.

MAD Square : మ్యాడ్​ స్క్వేర్ టాక్