YCP : వైసీపీ నుండి మరో లిస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్టారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 11 […]

Published By: HashtagU Telugu Desk
Ycp Fake News

Ycp Fake News

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్టారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చేయడం జరిగింది. మరికొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చబోతుందని వార్తలు ప్రచారం జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ఓ ఫేక్ ప్రెస్ నోట్ వైరల్ గా మారడం ఫై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినట్లు ఓ ఫేక్ ప్రెస్ నోట్ (Fake Press Note) లో అభ్యర్థుల మార్పు తాలూకా వివరాలు తెలిపారు. వారిలో ఎవరెవరు ఉన్నారంటే..

  • మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కాకినాడ రూరల్ ఇంచార్జ్
  • ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు ఇంచార్జ్
  • జగ్గంపేట ఇంచార్జ్‌గా మాజీ మంత్రి తోట నర్సింహం
  • పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ ఎంపీ వంగా గీతను ఇంచార్జుగా
  • రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తుల్ని
  • పాయకరావు పేట నియోజకవర్గానికి.. పెడవటి అమ్మాజీని ఇంచార్జిగా
  • రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ మార్గాని భరత్ కు సీటు కేటాయించారు.
  • రాజోలు నియోజకవర్గానికి అమ్మాజీని ఇంచార్జ్ గా నియమించినట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అది చూసిన వారంతా నిజమే కావొచ్చని మాట్లాడుకోవడం షేర్ చేయడం మొదలుపెట్టారు. దీనిని గమనించిన వైసీపీ అధిష్టానం..ఇది ఫేక్ ప్రెస్ నోట్ అని , జనసేన , టీడీపీ పార్టీలు కలిసి చేస్తున్న కుట్ర అని విమర్శలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.

Read Also :

  Last Updated: 22 Dec 2023, 07:58 PM IST