గోదావరిలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సహాయక శిబిరాల్లో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలవరం, ధవళేశ్వరం నీటిమట్టాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న 24 – 48 గంటల్లో వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలోని శ్రీరాంసాగర్తో సహా గోదావరి బేసిన్లోని అన్ని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నందున అవి 23 – 24 లక్షల క్యూసెక్కుల వరకు వెళ్లవచ్చని అంచనా వేశారు.
AP Floods : జగన్ ఏరియల్ సర్వే
గోదావరిలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

Jagan Surveh Helicopter
Last Updated: 15 Jul 2022, 12:45 PM IST