Suicide:బెజ‌వాడ‌లో నిజ‌మాబాద్ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌… అస‌లు కార‌ణాలు ఇవే..?

విజ‌య‌వాడ‌లో శ‌నివారం ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. నిజామాబాద్‌కి చెందిన సురేష్ కుటుంబం విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చి కుటుంబంలోని న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఘ‌ట‌న‌పై విజ‌య‌వాడ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - January 9, 2022 / 08:57 PM IST

విజ‌య‌వాడ‌లో శ‌నివారం ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. నిజామాబాద్‌కి చెందిన సురేష్ కుటుంబం విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చి కుటుంబంలోని న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఘ‌ట‌న‌పై విజ‌య‌వాడ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో నాలుగు మృత‌దేహాల‌కు ఆదివారం పోస్టుమ‌ర్టం పూర్తి చేసి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. అయితే వీరు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి వ‌డ్డీ వ్యాపారుల వేధింపులే కార‌ణ‌మ‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.

సురేష్ బావ‌మ‌రిది రాంప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ న‌లుగురు వ‌డ్డీ వ్యాపారుల వేధింపుల వ‌ల్లే త‌న అక్క‌,బావ‌, ఇద్ద‌రు పిల్ల‌లు విజ‌య‌వాడ వ‌చ్చి ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని తెలిపారు. ఆ నలుగురు అధిక వడ్డీ లు వసూళ్లు చేశారని.. డబ్బు లు కట్టక పోతే అంతుచూస్తామని బెదిరింపులు దిగారని రాంప్ర‌సాద్ ఆరోప‌ణ‌లు చేశారు. వాళ్ళు చనిపోయే ముందు కూడా సెల్ఫి విడియో కూడా తీసుకున్నారని.. మొత్తం వివ‌రాలు పోలీసుల వద్ద ఉన్నాయని ఆయ‌న వెల్ల‌డించారు. పోలీసులు ఆ నలుగురు వడ్డీ వ్యాపారస్తుల ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మ‌రోవైపు సురేస్ స్నేహితులు కూడా ఆ న‌లుగురు వ‌డ్డీ వ్యాపారుల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ఆ న‌లుగురు వ‌డ్డీ వ్యాపారులు చాలా డబ్బు వడ్డీ లు రూపంలో సురేష్ వద్ద నుండి దోచుకున్నారని సురేష్ స్నేహితుడు యాదగిరి ఆరోపించారు. అయిన వారి అధిక వడ్డీ, చక్రవడ్డి, బారు వడ్డీ పేరుతో వాళ్ళకు నరకం చూపించారని.. వారి వేధింపులు తాళలేక నిజామాబాదు నుండి వచ్చి విజయవాడ లో చనిపోయారన్నారు. దేవుడు దర్శించుకోవడానికి వచ్చి చివరకు దేవుడు వద్దకు వెళ్ళి పోయార‌ని.. పోలీసులు సురేష్ కుటుంబం మృతికి కారణమైన ఆ నలుగురు ను శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ నలుగురు వ‌ల్ల‌ నిజామాబాదు లో మరెవరికి అన్యాయం జరగకుండా చూడాల‌ని పోలీసుల‌ని కోరారు.