Varun Tej : బాబాయ్ కోసం రంగంలోకి దిగుతున్న మెగా హీరో

బాబాయ్ కోసం తన వంతు ప్రచారం చేస్తా అంటూ రేపు పిఠాపురం లో వరుణ్ తేజ్ పర్యటించబోతున్నారు

Published By: HashtagU Telugu Desk
Varun Pitapurm

Varun Pitapurm

ఈసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఎమ్మెల్యే గా చూడాలని యావత్ తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా ప్రజల కోసం కష్టపడుతూ వస్తున్న ఆయన్ను ..ఈసారి అసెంబ్లీ లో అడుగుపెట్టించి..అధ్యక్ష అని అనిపించేలా చేయాలనీ జనసేన శ్రేణులు, అభిమానులు కష్టపడుతున్నారు. ఇప్పటికే ఆయన గెలుపు ఖాయమని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాబాయ్ కోసం తన వంతు ప్రచారం చేస్తా అంటూ రేపు పిఠాపురం లో వరుణ్ తేజ్ పర్యటించబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పొత్తులో భాగంగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, బిజెపి తో కలిసి ఎన్నికల బరిలో నిల్చున్నాడు. మొత్తం 21 అసెంబ్లీ , 2 లోక్ సభ స్థానాలకు జనసేన పోటీ చేస్తుంది. వీటిలో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఇప్పటికే పిఠాపురంలో పర్యటించగా ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఓ పక్క తమ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటూనే..మిగతా కూటమి అభ్యర్థుల ప్రచారం లో పాల్గొంటూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఈ తరుణంలో రేపు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (Varun Tej) పిఠాపురం (Pithapuram )లో పర్యటించబోతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు , సినీ , బుల్లితెర నటులు హైపర్ ఆది , గెటప్ శ్రీను , పృథ్వీ, మొగిలి రేకులు ఫేమ్ సాగర్ తదితరులు జనసేన కోసం ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీరే కాదు ఈసారి కూటమి గెలుపు కోసం చాలామంది సినీ ప్రముఖులు రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. నేరుగా ప్రచారం చేయకపోయినా..వెనుకాల నుండి వారి సపోర్ట్ తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే మెగా స్టార్ చిరంజీవి సైతం ఇప్పటికే కూటమి కి జై కొట్టి అభిమానుల్లో , రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం నింపారు. మరి రేపు వరుణ్..పర్యటన ఏవిధంగా సాగనుందో చూడాలి.

Read Also : Yanamala Krishnudu : టీడీపీ కి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు

  Last Updated: 26 Apr 2024, 03:34 PM IST