Site icon HashtagU Telugu

Ram Mohan Naidu : రామ్మోహన్ నాయుడు సహా 9 మందికి ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డులు

Union Minister Kinjarapu Ram Mohan Naidu Young Global Leaders Award 2025 Tdp Indians India

Ram Mohan Naidu : కేంద్ర మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడుకు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 50 దేశాలకు చెందిన 116 మందితో విడుదల చేసిన యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన భారత పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. 40 ఏళ్లలోపు వయస్సు ఉండి వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేసి, ప్రపంచ స్థితిగతుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారిన ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తుంటారు. రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu)తో పాటు భారత్ నుంచి మొత్తం తొమ్మిది మంది యంగ్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు.

Also Read :Telangana Govt Jobs: ఉద్యోగాల జాతర.. 18,236 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్లు

యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారతీయులు వీరే.. 

Also Read :Bhu Bharati Portal: ‘భూ భారతి’ సేవలు ఏమిటి ? ఛార్జీలు ఎంత ?

ప్రత్యేక శిక్షణ సైతం.. 

దాదాపు 1000 కార్పొరేట్ కంపెనీలు కలిసి వరల్డ్ ఎకానమిక్ ఫోరంను నడుపుతున్నాయి. ఆ కంపెనీల నుంచే వరల్డ్ ఎకానమిక్ ఫోరం నిర్వహణకు నిధులు సమకూరుతుంటాయి. ఏటా 100 మందికిపైగా ప్రభావవంతమైన  యువతను యంగ్ గ్లోబల్ లీడర్ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. వారికి మూడేళ్ల పాటు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను  వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఏర్పాటు చేస్తుంది. వరల్డ్ ఎకానమిక్ ఫోరంకు నిధులను అందించే కంపెనీల విజన్‌కు అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ డిజైన్ అవుతాయి.  ఆర్థిక, టెక్, ప్రభుత్వ వ్యవహారాలు, క్రియేటివ్ పరిశ్రమలు, ప్రజా సేవ వంటి విభాగాల యువతను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.