Site icon HashtagU Telugu

Mithun Reddy : మిథున్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ..లుక్‌ఔట్ నోటీసులు జారీ

Unexpected development in Pakistani politics.. Imran Khan's ex-wife announces new party

Unexpected development in Pakistani politics.. Imran Khan's ex-wife announces new party

Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. కేసులో ఆయనకు ఏ4 నిందితుడిగా నమోదవడం, ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నం విఫలం కావడం, చివరికి పోలీసుల లుక్‌ఔట్ నోటీసుల జారీ ఇవన్నీ కలిపి ఆయన రాజకీయ భవిష్యత్తుపై శ్రద్ధపెట్టాల్సిన అవసరాన్ని తెచ్చిపెట్టాయి. తాజాగా, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. నిన్న వెలువడిన ఈ తీర్పులో, కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ఆయనకు ప్రస్తుతం బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు, ముందు జాగ్రత్తగా లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. లుక్‌ఔట్ నోటీసుల్లో, ఆయన విదేశాలకు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది సీబీఐ, ఎమిగ్రేషన్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది అందరికీ పంపబడినట్లు సమాచారం.

కోర్టులో వాదనలు – రెండు పక్షాల కూడా తీవ్రంగా

ఈ కేసులో, మిథున్ రెడ్డి పక్షాన న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా, ప్రభుత్వ పక్షాన సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా పక్షంగా వాదనలు సాగించారు. లూథ్రా, లిక్కర్ స్కామ్ వెనుక మిథున్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమని, సాక్షుల వాంగ్మూలాలు కూడా ఆయన పాత్రను ఉద్దేశించేందేనని కోర్టుకు వివరించారు. వైసీపీ పాలనలో ఆన్‌లైన్ మద్యం అమ్మకాలను మాన్యువల్ విధానానికి మార్చిన తర్వాత స్కామ్‌కి అవకాశాలు ఏర్పడాయని వాదించారు. ముడుపులు ఇచ్చిన సంస్థలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని కోర్టులో ఆరోపణలు చేశారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రూ.3,500 కోట్ల నష్టం జరిగినట్లు లూథ్రా వాదనలు వినిపించారు. ఇక, మిథున్ రెడ్డి తరఫున వాదించిన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..మద్యం విధానంలో మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు స్కామ్‌తో సంబంధం ఉన్నట్టు ఎలాంటి నేరపూరిత ఆధారాలు లేవని స్పష్టం చేశారు. షరతులతో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. కోర్టు ఈ వాదనలు గురువారం నాటి విచారణలో పూర్తి చేసిన తర్వాత తీర్పును రిజర్వు చేయగా, తాజాగా తీర్పు వెలువడి ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

రాజకీయ దళారులపై ఉక్కుపాదం?

ఈ కేసు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, మద్యం సరఫరాలో అవకతవకలపై ప్రజల్లో రుగ్మతలు పెరిగిన నేపథ్యంలో, ఈ కేసులో కీలక వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంపై తీవ్ర దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ కేసులో దోషిగా నిరూపితులైతే, ఇది వైసీపీకి రాజకీయంగా భారీ దెబ్బ అవ్వడం ఖాయం. ఇక, మిథున్ రెడ్డి ఎలాంటి చర్యలకు పాల్పడతారన్నది ఆసక్తికరంగా మారింది. లుక్‌ఔట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో, ఆయనకు భవిష్యత్‌లో విదేశీ ప్రయాణాలు కూడా కష్టతరమే కావచ్చు.

Read Also: Reham Khan : పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం..కొత్త పార్టీ ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య