2 Fishes – 4 Lakhs : 2 చేపలకు రూ.4 లక్షల ధర.. ఎందుకో తెలుసా ?

2 Fishes - 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి.

  • Written By:
  • Publish Date - April 14, 2024 / 12:02 PM IST

2 Fishes – 4 Lakhs : రెండు చేపలను వేలం వేస్తే.. ఏకంగా రూ.4 లక్షలకు అమ్ముడుపోయాయి. జనం ఎగబడి మరీ వేలం పాడి ఆ చేపలను దక్కించుకున్నారు. ఇంతకీ ఆ చేపల వెరైటీ ఏమిటి ? వాటికి అంత ధర ఎందుకు పలికింది ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో ఉన్న అంతర్వేది సముద్ర తీరంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు రెండు కచ్చిడీ చేపలు దొరికాయి. సముద్రంలో వీటిని పట్టుకొని తీసుకొచ్చిన జాలరులు.. ఈ చేపలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో వేలం వేశారు. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ రెండు చేపలకు ఏకంగా రూ.2 లక్షలు(2 Fishes – 4 Lakhs) చెల్లించి కొన్నాడో ఔత్సాహిక వ్యక్తి.

కచ్చడీ చేపలు

  • కచ్చడీ చేపలు చాలా అరుదుగా జాలర్లకు సముద్రంలో చిక్కుతుంటాయి.
  • సముద్రపు అడుగు భాగంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.
  • కచ్చిడీ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదని.. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది.
  • కచ్చిడీ చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్.
  • వీటిని కొనేవారు తినడానికన్నా.. వ్యాపారం చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు.
  • ఈ చేపల పొట్టలో తెల్లటి బ్లాడర్ ఉంటుంది.ఇది అత్యంత విలువైనది.
  • దీన్ని జనాలు మింగే మందుల్లో వినియోగిస్తారని చెబుతుంటారు.

Also Read :PM Kisan 17th Installment: రైతుల‌కు గుడ్ న్యూస్‌.. అకౌంట్లోకి డ‌బ్బులు, ఎప్పుడంటే..?

  • పలు మాత్రలకు పైపూతలా ఈ బ్లాడర్​ను వినియోగిస్తారు.
  • రోగులకు వైద్యులు ఆపరేషన్​ చేసిన తర్వాత కుట్లు వేసే దారం తయారీలోనూ ఈ చేప బ్లాడర్‌ను​ వాడుతారు.
  • కచ్చిడీ  చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుందని అంటారు.
  • పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలోనూ ఈ చేపను ఎక్కువగా వాడుతుంటారు.
  • కాస్ట్లీ వైన్స్ తయారీలో కూడా కచ్చిడీ చేపను ఉపయోగిస్తారట.
  • వైన్‌ను క్లీన్ చేసేందుకు ఈ చేప రెక్కలు వాడుతారట.

Also Read :Apsara A Diplomat : ‘అప్సర’ వేషధారణలో ఎవరో తెలుసా ?