Whats Today : ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మాదిగల విశ్వరూప బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ గోదావరిఖని సింగరేణి స్టేడియంలో కాంగ్రెస్ బహిరంగ సభ జరుగుతుంది. దీనికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్బాబు హాజరుకానున్నారు.
- ఇవాళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెజవాడ దుర్గమ్మను దర్శించుకుని నేరుగా శ్రీశైలం వెళ్లనున్నారు.
- ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.
- విజయవాడలో గత మూడు రోజులుగా జరుగుతున్న కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ షూటింగ్ నేటితో ముగియనుంది.
- క్రికెట్ వరల్డ్ కప్లో ఇవాళ పుణె వేదికగా ఆస్టేలియాతో బంగ్లాదేశ్ తలపడనుంది. ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మరోవైపు ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది.
- రేపు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం కార్యక్రమం ఉంది. ఈసందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు(Whats Today) చేసింది.