Pawan Kalyan : విశాఖలో మూడ్రోజులు జనసేన సమావేశాలు

Pawan Kalyan : క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు, 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan steps in to help the youth trapped in Myanmar!

Pawan Kalyan steps in to help the youth trapped in Myanmar!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 28 నుంచి విశాఖపట్నంలో మూడు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశ్యం. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి పెద్ద సమావేశాలు కావడంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో నేరుగా మాట్లాడనున్నారు.

BSNL : వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త.. తక్కువ ధరకే 3జీబీ డేటా..84 డేస్ వ్యాలిడిటీ!

మొదటి రోజు ఈ నెల 28న ఉదయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన విజయం సాధించి, ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే రోజు మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో ఆయన సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత విషయాలపై చర్చిస్తారు.

రెండో రోజు 29న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 10-15 మంది కార్యకర్తలతో పాటు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో భేటీ అవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు, 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులనుద్దేశించి ప్రసంగించనున్నారు. రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన స్పష్టమైన సందేశం ఇస్తారని భావిస్తున్నారు.

  Last Updated: 24 Aug 2025, 04:04 PM IST