Stone Attack : చంద్రబాబుపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్

Stone Attack : చంద్రబాబు నందిగామలో పర్యటిస్తూ (Chandrababu Nandigama Tour) ఆయన ఉన్న వాహనంపై అభివాదం చేస్తూ వస్తుండగా స్థానిక రైతు బజార్‌ వద్ద చందర్లపాడు రోడ్డులో కొందరు వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు

Published By: HashtagU Telugu Desk
Stone Attack

Stone Attack

రెండేళ్ల క్రితంచంద్రబాబు (TDP Chief)పై రాళ్ల దాడి (Stone Attack) చేసిన నిందితులను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. నిందితులను కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ గా గుర్తించారు. 2022 నవంబర్ 5న ఈ ఘటన జరిగింది. జగన్ సీఎం గా ఉన్న ఆ టైములో..చంద్రబాబు ప్రతిపక్ష నేత గా ఉన్నారు. చంద్రబాబు నందిగామలో పర్యటిస్తూ (Chandrababu Nandigama Tour) ఆయన ఉన్న వాహనంపై అభివాదం చేస్తూ వస్తుండగా స్థానిక రైతు బజార్‌ వద్ద చందర్లపాడు రోడ్డులో కొందరు వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మధుసూదనరావుకు గాయాలయ్యాయి. దీనిపై వెంటనే పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఈ ఘటన వెనుక జగన్ హస్తం ఉందని అప్పట్లోనే టిడిపి శ్రేణులు ఆరోపణలు చేసిన..పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారందరి పై బాబు రివెంజ్ తీర్చుకుంటున్నారు. నారా లోకేష్ అయితే ఓ రెడ్ బుక్ నే పెట్టుకున్నాడు. వైసీపీ నేతలు చేసిన దాడులు , అక్రమాలు, సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలు ఇలా అన్నింటిని నోట్ చేసుకొని..ఆలా చేసిన వారిపై వరుస కేసులు పెట్టిస్తూ వారికీ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కి చెందిన నేతలపై , వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పై కేసులు నమోదు అయ్యి..వారి బెండు తీస్తున్నారు. ఈ కేసులకు భయపడి..అప్పుడు రెచ్చిపోయిన PTM బ్యాచ్..ఇప్పుడు క్షేమపణలు చెప్పడం..కొంతమందితే ఏకంగా రాజకీయాలను వదిలేస్తున్నామని ప్రకటించడం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బాబు మాత్రం వైసీపీ బ్యాచ్ కి నిద్ర కూడా పోనివ్వడం లేదు.

Read Also : Jharkhand Elections Result : జార్ఖండ్‌లో జయహో ‘ఇండియా’.. సీఎం సోరెన్ దంపతులు సూపర్ హిట్

  Last Updated: 23 Nov 2024, 03:58 PM IST