AP Results Day : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది: : సీఎం చంద్రబాబు

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తిరస్కరించిన రోజు ఇది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన సైకో పాలనకు ముగింపు పలికి, ప్రతి పౌరుడు స్వేచ్ఛతో ఊపిరి పీల్చిన తిత్లీ సమయంగా జూన్ 4 నిలిచింది అని చంద్రబాబు చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Visakha Economic Region

Visakha Economic Region

AP Results Day : జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రను తిరగరాసిన రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజల శక్తి ఏంటో నిరూపించిన రోజు ఇది అని, ప్రజా విప్లవం ముందు నియంతల పాలన ఓడిపోయిన ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఓ భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తిరస్కరించిన రోజు ఇది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన సైకో పాలనకు ముగింపు పలికి, ప్రతి పౌరుడు స్వేచ్ఛతో ఊపిరి పీల్చిన తిత్లీ సమయంగా జూన్ 4 నిలిచింది అని చంద్రబాబు చెప్పారు. ఓటు అనే ఆయుధాన్ని సమర్థవంతంగా వినియోగించి, ఉద్యమంలా ఓట్లు వేసి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించిన రోజు ఇదని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని, పసుపు సైనికులు, జనసైనికులు, కమలనాథుల సమిష్టి పోరాటం ద్వారా కూటమి గెలిపించి, అభివృద్ధికి కొత్త దిశ చూపిన మైలు రాయి ఈ రోజు అని తెలిపారు. తన నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా, గత ఏడాది జూన్ 4న వచ్చిన ఫలితాలను గుర్తుచేసుకుంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శిరసు వంచి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు ప్రభుత్వం ప్రతిరోజూ కృషి చేస్తోందని, సంక్షేమాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తూ, అభివృద్ధికి గట్టి పునాది వేసిందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో పాలనను గాడిలో పెట్టాము. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ వంటి రంగాల్లో అభివృద్ధికి బీజం వేశాము. రాష్ట్ర దిశను మార్చేందుకు ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పు ఒక భవిష్యత్తును మలిచే నిర్ణయమైంది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మేము నెరవేరుస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.

రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. గత పాలనలో దేశంలో ఎన్నడూ లేనంత విధ్వంసం తలెత్తినందున, ఈసారి ప్రజలు స్పష్టమైన తీర్పుతో మార్పును తెచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. కూటమి విజయానికి కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం..వీటిపైనే ప్రధాన చర్చ

 

 

  Last Updated: 04 Jun 2025, 10:54 AM IST