అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Kutami Govt

Kutami Govt

Kutami Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఇది నిజంగా శుభవార్త. ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా రైతులకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం నేడు ఆ మాటను పూర్తిస్థాయిలో నెరవేర్చింది. మార్చి 13న మూడో విడత నిధుల విడుదలతో రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

మూడు విడతల్లో రూ. 20,000 పూర్తి

ప్రధాని నరేంద్ర మోదీ సహకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో అమలవుతున్న ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో రూ. 14,000 జమ చేసిన ప్రభుత్వం, నేడు మిగిలిన మొత్తాన్ని విడుదల చేసింది.

మొదటి విడత (ఖరీఫ్): ఆగస్టు 2, 2025న రూ. 7,000

రెండో విడత (రబీ): నవంబర్ 19, 2025న రూ. 7,000

మూడో విడత: మార్చి 13న రూ. 6,000 (నేడు జమ అయ్యింది)

దీనితో ఒక్కో రైతు ఖాతాలోకి ఈ ఏడాది మొత్తంగా రూ. 20,000 ఆర్థిక సాయం చేరినట్లయింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

Also Read: సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

గతంతో పోలిస్తే భారీ పెరుగుదల

గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఏడాదికి కేవలం రూ. 7,500 మాత్రమే రాష్ట్రం నుండి అందేది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర వాటాను భారీగా పెంచి రూ. 14,000 అందిస్తోంది. కేంద్రం ఇచ్చే రూ. 6,000 కలిపి ఇప్పుడు రైతన్నకు ఏడాదికి రూ. 6,500 అదనంగా లభిస్తోంది.

ధాన్యం డబ్బులు.. గంటల్లోనే జమ!

రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 11 నాటికి 7.31 లక్షల మంది రైతులకు రూ. 10,571 కోట్లు చెల్లించారు. విశేషమేమిటంటే 55% చెల్లింపులు కేవలం 8 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి చేరడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం.

వ్యవసాయానికి అండగా మరిన్ని చర్యలు

ఆర్థిక సాయంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విత్తనాలకు రూ. 240 కోట్లు, యాంత్రీకరణకు రూ. 219 కోట్లు కేటాయింపు. 6 లక్షల మంది రైతులకు పరీక్షా పత్రాల పంపిణీ. 2026 జూలై నాటికి వెలిగొండ, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వార్షిక ఆర్థిక సాయం హామీని ఉగాది పండుగకు ముందే పూర్తి చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “అన్నదాత సుఖీభవ” నినాదం ఇప్పుడు నిజమైందని సామాన్య రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 13 Mar 2026, 03:29 PM IST