కాకినాడ జిల్లా పెద్దాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పెద్దాపురంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్ లో నేడు లై డిటెక్టర్ పరీక్షలకి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు సిద్ధమైయ్యారు. అక్రమ మట్టి తవ్వకాలు, మైనింగ్ మాఫియా, గ్రావెల్ తవ్వకాలు కి దొరబాబు అండగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప ఆరోపణలు చేశారు. ఎవరి ప్రభుత్వం లో అవినీతి జరిగిందో బహిరంగ చర్చ జరిపి, లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే చిన్నరాజప్పకి.. దవులూరి దొరబాబు సవాల్ విసిరారు. చర్చించేందకు తాను సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే ఎమ్మెల్యే చిన్నరాజప్ప ప్రకటించారు. తాను ఓడిపోతే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని దవులూరి దొరబాబు ప్రకటించారు. ఇరువురి సవాళ్లతో పెద్దాపురంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. పరిస్థితులును బట్టి హౌస్ అరెస్ట్ లు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.