Site icon HashtagU Telugu

TDP Mahanadu : టీడీపీ మహానాడు – లోకేష్‌కు ప్రమోషన్?

Nara Lokesh Raises New Doub

Nara Lokesh Raises New Doub

ఈ నెల 27 నుంచి కడప జిల్లా కమలాపురంలో జరగనున్న టీడీపీ మహానాడు (Mahanadu) పార్టీకి మలుపు తిప్పే వేడుకగా భావించబడుతోంది. ప్రతీ సంవత్సరం లాగే ఈసారి కూడా మహానాడు ద్వారా పార్టీ తన సిద్ధాంతాలను, పాలనా లక్ష్యాలను స్పష్టతగా ప్రకటించనుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. యువతలో ప్రాచుర్యం పొందిన నారా లోకేష్ చుట్టూ మహానాడు ఉండబోతుంది. మహానాడులో ఆయనకు పార్టీ పరంగా ప్రమోషన్ ఇవ్వనుందన్న వార్తలు వినిపిస్తుంది. ఇది కేవలం ప్రచారం కాదని, లోకేష్ గత రెండేళ్లుగా పార్టీ కోసం చేసిన కృషి దీనికి కారణమని నేతలు చెబుతున్నారు.

Weekly Worship Guide: వారంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి.. దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది ప్రజలను కలిశారు. ఆయన మాటల్లో స్పష్టత, టెక్నాలజీపై అవగాహన, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించడం — ఇవన్నీ పార్టీకి కొత్త ఊపుని ఇచ్చాయి. గతంలో రాజకీయ వారసత్వానికి చెందిన నాయకుడిగా విమర్శలు ఎదుర్కొన్న లోకేష్, ఇప్పుడు తన స్వంత శ్రమతో ప్రజల మద్దతును సంపాదించడంలో విజయవంతమయ్యారు. ఆయన పాదయాత్ర సమయంలో ఎన్నో ప్రాంతాలలో యువతతో ఆత్మీయంగా మమేకమై, వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

ఈ నేపథ్యంలో మహానాడులో నారా లోకేష్‌కు ప్రధాన పాత్ర ఇవ్వడమేగాక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరింత బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇవ్వాలన్న అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయాల ద్వారా చంద్రబాబు నాయుడు పార్టీని యువతకు మరింత దగ్గర చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. మహానాడుతో పార్టీ ఒకవైపు అధికార పునరాగమనం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుండగా, మరోవైపు కొత్త తరం నాయకత్వాన్ని ఎదిగే అవకాశాలు కల్పిస్తూ, భావితర రాజకీయాలకు దారితీస్తోంది.