Bk Parthasarathi: టీడీపీ అభ్య‌ర్థికి తప్పిన ప్రమాదం.. కారు ముందు భాగం డ్యామేజ్‌

హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్థసారథికి పెను ప్ర‌మాదం త‌ప్పింది.

Published By: HashtagU Telugu Desk
Safeimagekit Resized Img (6) 11zon

Safeimagekit Resized Img (6) 11zon

Bk Parthasarathi: శ్రీస‌త్య‌సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్థసారథి (Bk Parthasarathi)కి పెను ప్ర‌మాదం త‌ప్పింది. శనివారం అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్‌హెచ్ 44లో ఉన్న‌ హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనం ఆక‌స్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి కారు ఐచ‌ర్ వాహ‌నాన్ని ఢీకొట్టింది. దీంతో ప్ర‌మాదం చోటుచేసుకుంది. పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం వెనుక వైపు ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న పార్థసారథికి పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం జరిగిన తర్వాత ఎస్కార్ట్ వాహనం స్కార్పియోలో అక్కడి నుండి పార్థసారథి వెళ్లిపోయారు. ప్ర‌మాదానికి గ‌ల పూర్తి కార‌ణాలు తెలియాల్సి ఉంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకున్నారు. పార్థ‌సార‌థికి వాహ‌నానికి ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలుసుకున్న పార్టీ కార్య‌క‌ర్తలు, అభిమానులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. అంతేకాకుండా పోలీసులు ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Pithapuram: పవన్ ని ఓడించేందుకు కుట్ర..పిఠాపురంలో 80 లక్షల మద్యం సీసాలు..

అయితే ఇదే నెల ప్రారంభంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరుఖ్‌కి కూడా పెను ప్రమాదం తప్పిన విష‌యం తెలిసిందే. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఫ‌రూఖ్ వాహ‌నం అనుకోకుండా గేదెలను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌ తమ్మరాజు పల్లె వద్ద జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన‌ వెంటనే కారులో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఫ‌రూఖ్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డారు. అయితే ఫ‌రూఖ్‌కి ఈ ప్ర‌మాదంలో స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 27 Apr 2024, 11:58 AM IST