ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పరస్పరం మైండ్ గేమ్ ఆడుకోవడానికి ఆ వేదికను ప్రధాన పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. దీంతో నిజం తెలిసే లోపలే అబద్ధం అందరికీ చేరుతోంది. అందుకే, ఇటీవల కొందర్ని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది. అయితే, ఆ విచారణ అంతా వన్ సైడ్ ఉందని సీఐడీ ఆరోపణలను ఎదుర్కొంటోంది. తాజాగా సోషల్ మీడియా పోస్ట్లు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో హింసను ప్రేరేపించాయి. పోలీసుల ప్రకారం, మోర్ల వర కృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రేరేపించే పోస్ట్ చేయడంతో హింస ప్రారంభమైంది. ఆ ట్వీట్ను చూసి కొందరు అతడిని కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.
“ఒక పార్టీకి చెందిన వ్యక్తులు సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీంతో ఇతర పార్టీల వారు అతడిని కొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దెందులూరు పోలీస్స్టేషన్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పార్టీల మధ్య మళ్లీ పోరు మొదలైంది. రాళ్లదాడి సంఘటన జరిగినందున పోలీసులు అదనపు బలగాలను కోరారు, కానీ ఎవరూ గాయపడలేదు. గాయపడిన ఇద్దరి ఫిర్యాదుతో ఒక కేసు నమోదు కాగా, ఎస్ఐ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో పోస్టులను రెచ్చగొట్టినందుకు మరో కేసు నమోదు చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.
సమీపంలోని పోలీసు బలగాలు కావడంతో మేము కృష్ణా జిల్లా పోలీసు బలగాలను కూడా సహాయం కోరారు.. గ్రామంలో పోలీసులు గస్తీ తిరుగుతూ అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దని చెప్పారు. సెక్షన్ 144 విధించారు. ఇలాంటి పరిస్థితి ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో నెలకొంది. ఆనాడు రంగనాయకమ్మ అనే వృద్ధ మహిళ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్ ను ప్రమోట్ చేశారని అదుపులోకి తీసుకుని విచారించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా నిర్వాహకుల్ని పలుమార్లు ఏపీ సీఐడీ విచారణ చేసింది. అయినప్పటికీ. సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో కట్టడీ చేయలేని పరిస్థితి ఉంది. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సోషల్ మీడియాకు స్వేచ్ఛ ఉంది. దాన్ని ఉపయోగించుకుని సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ను రక్తి కట్టిస్తున్నారు. ఆ క్రమంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏపీలో నెలకొనడం గమనార్హం.