YS Jagan : సింగయ్య మృతి కేసు.. వైఎస్‌ జగన్‌కు నోటీసులు

గత ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి సందర్శనకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది.

Published By: HashtagU Telugu Desk
YS Jagan

YS Jagan

YS Jagan : గుంటూరు జిల్లా రాజకీయ వర్గాలను కుదిపేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో క్రిమినల్ కేసు నమోదైంది. ఈసారి ఆయనపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణల నేపథ్యంలో పోలీసుల చర్యలు ప్రారంభమయ్యాయి. గత ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి సందర్శనకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, జగన్ ఇతర వైసీపీ నేతలతో కలిసి అధికారిక అనుమతులు లేకుండానే యార్డుకు వెళ్లడం, అక్కడ ప్రసంగాలు చేయడం ప్రస్తుత వివాదానికి కారణమైంది.

Read Also: Mantralayam Temple : రికార్డు స్థాయిలో మంత్రాలయం ఆలయ హుండీ ఆదాయం..ఎంతో తెలుసా?

జగన్‌తో పాటు ఈ పర్యటనలో పాల్గొన్న వైసీపీ ప్రముఖులు అంబటి రాంబాబు, కావటి మనోహర్ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్చి యార్డు ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలాంటి ప్రభుత్వ సంస్థల ప్రాంగణంలో రాజకీయ ప్రసంగాలు చేయడం ఎన్నికల నియమాలకు వ్యతిరేకమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో భాగంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితులందరికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేశారు. విచారణ కోసం పోలీసులు పిలిచిన తేదీన హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న నేతలు తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: CM Revanth Reddy: చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా: సీఎం రేవంత్‌

  Last Updated: 24 Jun 2025, 07:56 PM IST