Site icon HashtagU Telugu

YS Sharmila: కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల, చేరికకు రంగం సిద్ధం!

YS Sharmila meeting with Congress DK Shivakumar and Congress new plan for ap

YS Sharmila meeting with Congress DK Shivakumar and Congress new plan for ap

వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి జనవరి 4న న్యూఢిల్లీలో పార్టీలో చేరనున్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ నేతల సమక్షంలో ఆమె పార్టీలో చేరనున్నారు. AP. అసెంబ్లీ ఎన్నికలు -2024కి AICC ఆమె AICC కార్యదర్శిని మరియు స్టార్ క్యాంపెయినర్‌ని నియమించి, ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా చేసే అవకాశం ఉందని తెలిసింది. ఏపీలోని ఆమె అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

వైఎస్ షర్మిలను తొందరలోనే ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం మళ్ళీ మంతనాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే షర్మిల ముందు కాంగ్రెస్ అధిష్టానం మూడు ఆప్షన్లుంచినట్లు తెలిసింది. అవేమిటంటే కర్నాటక లేదా తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ అయి పార్టీ పగ్గాలు అందుకోవటం. రెండోది ఏమిటంటే పార్టీ పగ్గాలు అందుకుని కడప లోక్ సభకు పోటీచేయటం. ఇక మూడో ఆప్షన్ ఏమిటంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత రాజ్యసభకు నామినేట్ అవ్వటం.

అయితే షర్మి రాకతో ఏపీ రాజకీయలు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వైసీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడనుంది. ఇప్పటికే షర్మిల కడప నుంచి పోటీ చేయనున్నట్టు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Also Read: Harish Rao: యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలి: హరీశ్ రావు