Site icon HashtagU Telugu

Sattva : లోకేష్ రోడ్ షో ఫలితం.. విశాఖ ఐటీ రంగానికి బంపర్ బూస్ట్

Sattva

Sattva

Sattva : విశాఖపట్నంలో ఐటీ రంగ అభివృద్ధికి భారీ ప్రోత్సాహకంగా నిలిచే మరో మెగా ప్రాజెక్ట్‌ను సత్త్వా గ్రూప్ (Sattva Group) ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రముఖ రియల్ ఎస్టేట్, ఐటీ పార్క్ డెవలప్‌మెంట్ కంపెనీ, విశాఖలో 30 ఎకరాల్లో ఒక మోడర్న్ మిక్స్‌డ్-యూజ్ టెక్ క్యాంపస్‌ను నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ దాదాపు ₹1,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పూర్తయిన తర్వాత ఇందులో 25,000 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ కొత్త క్యాంపస్ పేరు సత్వ వింటేజ్ వైజాగ్ (Sattva Vantage Vizag). ఇందులో స్మార్ట్ టెక్నాలజీతో నిర్మించే గ్రేడ్-ఏ ఆఫీస్ బిల్డింగులు, హైఎండ్ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, మోడర్న్ కమర్షియల్ స్పేసులు ఉండనున్నాయి. స్మార్ట్ సిటీ కాంకెప్ట్‌లో భాగంగా నిర్మించే ఈ ప్రాంగణం సుస్థిర నిర్మాణ విధానాలు, పర్యావరణ అనుకూలతలతో తయారవుతుంది. విశాఖను ఫ్యూచర్ టెక్ డెస్టినేషన్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగు అవుతుంది.

PM Modi : నమీబియాలో ప్రధాని మోడీ..ఆఫ్రికన్ దేశంలో మూడవ భారత ప్రధాని గౌరవం

ఈ ప్రాజెక్ట్ ప్రస్తావన నారా లోకేష్ నేతృత్వంలోని బెంగళూరు రోడ్‌షోలో జరిగింది. ఈ సందర్భంగా సత్త్వా గ్రూప్, ANSR వంటి పెద్ద సంస్థలు తమ ప్రాజెక్టులను విశాఖకు తీసుకురావాలని ఒప్పందాలు చేసుకున్నాయి. ANSR కూడా ఇక్కడ తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను (GCC) స్థాపించబోతుంది. అది కూడా మరో 10,000 ఉద్యోగాలకు దారితీయనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే 2–3 సంవత్సరాల్లో మొత్తం 2 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా విశాఖను ఓ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ, ANSR లాంటి ప్రాజెక్టులతో పాటు ఇప్పుడు సత్త్వా గ్రూప్ ప్రాజెక్ట్ ఆ లక్ష్యానికి మరింత వేగం ఇస్తోంది.

MLA Assault : క్యాంటీన్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య