CM Jagan Attack: ఎయిర్ గన్ తో జగన్ పై ఎటాక్.. సజ్జల అనుమానాలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ పై కావాలనే ఎయిర్ గన్ తో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 'మేమంత సిద్ధం' బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగకుండా

Published By: HashtagU Telugu Desk
Cm Jagan Attack

Cm Jagan Attack

CM Jagan Attack: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ పై కావాలనే ఎయిర్ గన్ తో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘మేమంత సిద్ధం’ బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగకుండా, ప్రతిపక్షాలకు మింగుడు పడని కారణంగానే జగన్ ని టార్గెట్ చేసినట్లు సజ్జల ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎయిర్‌గన్‌తోనో, షార్ప్‌షూటర్‌తో దాడి చేశారన్నారు.

జగన్‌కు తగిలిన రాయిఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెల్లెంపల్లి శ్రీనివాస్‌కు తగిలింది. దీంతో అతని రెటీనాకు తీవ్ర గాయమైంది. అతన్ని 48 గంటల పరిశీలనలో ఉంచారని సజ్జల చెప్పారు. రాయలసీమ తర్వాత జగన్ యాత్ర ప్రభావం తగ్గుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావించి ఉంటారని అయితే ఇతర జిల్లాలలో కూడా విజయవంతంగా యాత్ర కొనసాగుతుండటంతో చంద్రబాబు నాయుడును నిరాశపరిచిందని అన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో చంద్రబాబు స్వరం మారిపోయి ద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడం ప్రారంభించిందని అన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సహా జాతీయ నాయకులు భద్రతా వైఫల్యంపై సంతాపం వ్యక్తం చేస్తుంటే, టీడీపీ మాత్రం భద్రతా లోపంగా పేర్కొంటూ పోలీసులపై నిందలు వేయాలని చూస్తోందన్నారు.అయితే జగన్ పై జరిగిన సాధారణ దాడి కాదని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేసి హత్య చేసేందుకు ప్లాన్‌ చేసిన ప్రయత్నమంటూ వ్యాఖ్యానించారు. 2019లో కూడా జగన్ పై దాడి చేశారని అయితే అప్పుడు దేవుడే అతడిని కాపాడాడు అంటూ సజ్జల అన్నారు. కాగా వైద్యుల సలహా మేరకు యాత్ర ఆగదని, ఒకరోజు విశ్రాంతి తర్వాత సోమవారం నుంచి యాత్ర కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని, సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చీప్ ట్రిక్స్ ఆడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.

We’re now on WhatsAppClick to Join

మాకు సానుభూతి అవసరం లేదు. 2003లో అలిపిరి ఘటన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సానుభూతి తనను కాపాడుతుందని భావించి ఎన్నికల్లో ఓడిపోయారు. అది అతని ఆలోచన విధానం. ఎన్టీఆర్ ఎపిసోడ్‌లో లక్ష్మీపార్వతిని బలిపశువుగా చేసినట్లే అతను ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని సజ్జల చెప్పారు. జగన్ పై దాడిలో చంద్రబాబు హస్తం ఉందా లేక ఆయన కుమారుడు లోకేష్ హస్తం ఉందా అనేది పోలీసుల విచారణలో తేలుతుందని అన్నారు. విచారణ అనంతరం నిజానిజాలు బయటకు వస్తాయని హెచ్చరించారు.

Also Read: BJP Manifesto vs Congress Manifesto: బీజేపీ మేనిఫెస్టో Vs కాంగ్రెస్ మేనిఫెస్టో

  Last Updated: 14 Apr 2024, 04:32 PM IST