Site icon HashtagU Telugu

New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

CM Chandrababu

CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, అర్హులైన వారికి మాత్రమే చేరేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈకేవైసీ ద్వారా ప్రతి వ్యక్తి వివరాలు ఆధార్‌తో అనుసంధానమవుతాయి. ఇది పూర్తిగా ఆధార్‌ ఆధారిత వ్యవస్థ కావడంతో కేవలం అర్హులైనవారికే పథకాల లబ్ధి అందుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. లబ్ధిదారులు తమ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్ నంబర్‌ ద్వారా ఓటీపీని పొందటం ద్వారా సులభంగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేశారు.

KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సచివాలయ సిబ్బందిచేత మాత్రమే ఈ పనిని చేయించడం వల్ల సమయం ఎక్కువ పడుతుందనే కారణంతో ప్రజలే స్వయంగా ఈకేవైసీ చేసుకునేలా ప్రభుత్వం ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే ఈకేవైసీకి డెడ్‌లైన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి పథకాల లబ్ధిదారులందరూ ఆలస్యం చేయకుండా వెంటనే తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం అత్యంత అవసరం. ఇది చేయని పక్షంలో పథకాల లబ్ధి తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ సూచనలను అనుసరించి ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలు సరిచూసి ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్థులు కూడా ఈ ప్రక్రియలో ముఖ్యమైన వర్గంగా పరిగణించబడ్డారు. “తల్లికి వందనం”, “జగనన్న విద్యా దీవెన”, “జగనన్న వసతి దీవెన” వంటి పథకాలను పొందుతున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ప్రభుత్వం బాలాధార్‌ నుంచి సాధారణ ఆధార్‌కి అప్‌గ్రేడ్‌ చేయడం కోసం 5–17 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థుల వివరాలను నవీకరిస్తోంది. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 20న ప్రారంభమైనప్పటికీ మొంథా తుఫాన్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో మళ్లీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీ పిల్లలకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పారదర్శకత, లబ్ధిదారుల అర్హత ధృవీకరణ, మరియు అవినీతి నివారణ లక్ష్యంగా ఈకేవైసీ ప్రక్రియను బలంగా అమలు చేస్తోంది.

Exit mobile version