Visakhapatnam: ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు, బంగారం వెలుగు చూస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాషింగ్ మెషీన్లో రూ.1.30 కోట్ల నగదును ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ట్రాలీలో విజయవాడకు తరలిస్తున్న రూ.1.30 కోట్ల నగదును విశాఖపట్నం పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు విశాఖపట్నం క్రైం పోలీసులు విశాఖ ఎయిర్పోర్ట్లో వాహనాల తనిఖీలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఎలక్ట్రానిక్ దుకాణానికి చెందిన మొత్తం ఆరు వాషింగ్ మెషీన్లు, 30 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ వ్యక్తి ఇచ్చిన సమాధానాలు షాకింగ్ కు గురి చేశాయి. పట్టుబడ్డ నగదు, వాషింగ్ మెషీన్, సెల్ ఫోన్లు అన్నీ దసరా విక్రయానికి సంబంధించినవేనని చెప్పారు.అయితే ఇన్వాయిస్లు మరియు ఇతర సంబంధిత పత్రాలను సమర్పించడంలో విఫలమవడంతో, పోలీసులు నగదు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41, 102 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం