Site icon HashtagU Telugu

Reliance : ఏపీలో కొన్ని వందల కోట్లతో రిలయన్స్ భారీ ప్లాంట్

Ap Reliance

Ap Reliance

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో ఫుడ్ & బివరేజ్ రంగంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. జూన్ 19న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా, సంస్థ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది.

Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు బుమ్రా దూరం? అతని స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరంటే?

ఈ పరిశ్రమకు రూ.1622 కోట్ల పెట్టుబడి లభించనున్నదిగా తెలిపిన రిలయన్స్ సంస్థ, ఓర్వకల్లు సమీపంలో 80 ఎకరాల భూమిపై పరిశ్రమను స్థాపించనుంది. APIIC ల్యాండ్ బ్యాంకులోని ఈ భూమిని ఎకరాకు రూ.30 లక్షల చొప్పున కేటాయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పన్ను మినహాయింపులు, విద్యుత్ రాయితీలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహాలు అందించనున్నారు. శీతల పానీయాలు, పండ్ల రసాలు, ప్యాకెజ్డ్ వాటర్ తయారీకి ఈ యూనిట్ లో ఉత్పత్తులు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, పరోక్షంగా పలువురు ఇతర రంగాల్లో ఉపాధి పొందనున్నారు.

ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి 2025 డిసెంబర్ కల్లా ఉత్పత్తిని ప్రారంభించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలు & వాణిజ్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, APIIC చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పారిశ్రామికంగా వెనుకబడిన రాయలసీమకు ఈ ప్రాజెక్టు ప్రగతికి తోడ్పడుతుందని, స్థానిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదలకూ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.