Site icon HashtagU Telugu

Rain Alert : ఏపీలో మ‌రో మూడు రోజుల పాటు వ‌ర్షాలు – ఐఎండీ

Rains Imresizer

Rains Imresizer

ఏపీలో మ‌రో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. IMD అంచనా ప్రకారం, శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారి ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ వాయుగుండం బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా అల్పపీడనం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులు ఆదివారం నుంచి వేటకు వెళ్లవద్దని, వేటకు వెళ్లిన వారు శనివారంలోగా తిరిగి రావాలని కోరారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. దక్షిణ కర్ణాటక, తమిళనాడుపై కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.