జగన్ను ‘అష్టదిగ్బంధనం’ చేయబోతున్న బాబు – పవన్ ?

మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని చంద్రబాబు , అండ్ పవన్..ఇక వైసీపీ నేతల కట్టడికి ఉకూం జారీ చేస్తున్నారు. ఇప్పటికే అంబటి ని లోపల వేయగా..మిగతా నేతల ఆటలు కట్టించేందుకు చూస్తున్నారు ముఖ్యంగా జగన్ ను అష్టదిగ్బంధనం చేయాలనీ కసరత్తులు మొదలుపెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Jagan Babu Pawan

Jagan Babu Pawan

Pawan Kalyan Meeting With Chandrababu : రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెప్పడం తో కూటమి సర్కార్..దూకుడు పెంచింది. మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని చంద్రబాబు , అండ్ పవన్..ఇక వైసీపీ నేతల కట్టడికి ఉకూం జారీ చేస్తున్నారు. ఇప్పటికే అంబటి ని లోపల వేయగా..మిగతా నేతల ఆటలు కట్టించేందుకు చూస్తున్నారు ముఖ్యంగా జగన్ ను అష్టదిగ్బంధనం చేయాలనీ కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి వ‌చ్చిన పవ‌న్ క‌ల్యాణ్‌.. సీఎంతో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు.

ఈ భేటీలో ప్రధానంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై లోతుగా చర్చించారు. సిట్ (SIT) నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని, గత ప్రభుత్వం శ్రీవారి పవిత్రతను ఎలా భ్రష్టు పట్టించిందో ఆధారాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దర్శన టికెట్లు, ప్రసాదాల తయారీలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేయడం ద్వారా వైసీపీ నైతికతను ప్రశ్నించాలని భావిస్తున్నారు. కేవలం ప్రభుత్వపరంగానే కాకుండా, పార్టీల తరపున కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఈ విషయాలను వివరించి వైకాపాను రాజకీయంగా ఇరకాటంలో పెట్టడమే ఈ ‘అష్టదిగ్బంధనం’ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

మరోవైపు, వైసీపీ అనుసరిస్తున్న కుల రాజకీయాల పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి అరెస్టును సాకుగా చూపుతూ కాపు అజెండాను తెరపైకి తెచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని వారు నిశ్చయించుకున్నారు. సమాజంలో వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వైకాపా వ్యూహాలను సామాజిక వర్గాల పరంగానే ఎండగట్టాలని కార్యాచరణ రూపొందించారు. బలమైన ఎదురుదాడితోనే వైసీపీ నాయకుల ఆటలు కట్టించాలని, ఇందులో ఎలాంటి ఆషామాషీ ధోరణి ఉండకూడదని కూటమి నేతలు ఒక అవగాహనకు వచ్చారు.

  Last Updated: 05 Feb 2026, 11:08 AM IST