Site icon HashtagU Telugu

AP: ఎందుకీ గర్జనలు ? జగన్ సర్కార్ పై పవన్ ఆగ్రహం..!!

Pawan

Pawan

వైసీపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వికేంద్రీకరణ వర్సెస్ అభివ్రుద్ధి అంటూ పలు అంశాలను ప్రస్తావించిన పవన్ కల్యాణ్…వికేంద్రీకరణకు మద్దతు పేరుతో ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు…ఈనెల 15న విశాఖ గర్జన పేరుతో తలపెట్టిన ర్యాలీని ఉద్దేశించి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ కు తనదైన రీతిలో కౌంటర్లు ఇచ్చారు. ఎందుకీ గర్జన..అంటూ వరుస ట్వీట్స్ చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయడానికేనా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి ఇప్పుడు ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్ .