Pawan Kalyan : మరోసారి పవన్ కాకినాడ టూర్..3 రోజులే అక్కడే

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 11:51 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి కాకినాడ (Kakinada) లో మకాం వేయబోతున్నారు. రేపటి నుండి మూడు రోజుల పాటు పవన్ అక్కడే గడపబోతున్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్..పూర్తిగా తన ఫోకస్ ను ఎన్నికల ఫై పెట్టారు. పార్టీ లోకి చేరికలు , అభ్యర్థుల ఎంపిక , ప్రచార కార్యక్రమాలు , ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమాలు ఇలా అన్నింటిపై దృష్టి సారించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో కాకినాడ ఫై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. రీసెంట్ గా మూడు , నాల్గు రోజులు కాకినాడ లోనే ఉండి పార్టీ కార్యచరణ కు సంబంధించి నేతలతో మాట్లాడిన పవన్..రేపు మరోసారి కాకినాడ కు వెళ్ళబోతున్నారు. ఈసారి కూడా మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. అమలాపురం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో విడిగా విడిగా సమావేశం కానున్నారు. డివిజన్ల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే మొత్తం 50 డివిజన్ లలో 22 డివిజన్ ల రివ్యూ ముగిసింది.. మిగతా డివిజన్ లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ నుండి బరిలోకి దిగబోతారనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే పవన్ కాకినాడ ఫై మరింత ఫోకస్ పెట్టారని అంటున్నారు.

Read Also : AP : ఎవరు పార్టీని వీడిన నష్టమేలేదు – వైవీ సుబ్బారెడ్డి