Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు . ఈరోజు శుక్రవారం పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది.

Palla Srinivasa Rao: పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు . ఈరోజు శుక్రవారం పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావును టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పల్లా విజయం పార్టీలో ప్రతిష్టాత్మక స్థానానికి ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించింది.

గతంలో అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మంత్రిగా నియమితులైన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త నేతను నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును ఎంపిక చేయడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Also Read: Chiru Nagababu: ‌ మెగా బ్రదర్స్‌కు రాజ్యసభ..! మోడీ ప్లాన్ అదేనా?