Site icon HashtagU Telugu

Chandrababu : చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా.?

Chandra Babu (1)

Chandra Babu (1)

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. అలాగే.. వైసీపీని ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడు మీదున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరడం కోసం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ లు హస్తినకు వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే.. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరడం ఖాయమైంది.

We’re now on WhatsApp. Click to Join.

30 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాల్లో జనసేన, బీజేపీలను నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే 145 ఎమ్మెల్యే, పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయడం తెలుగుదేశం పార్టీకి చాలా శుభపరిణామం. అలాగే కూటమికి నష్టం జరగకుండా ఉండేందుకు బీజేపీ ఇచ్చే సీట్లు కూడా నీట్‌గా తీసుకున్నారని వినికిడి. ఇప్పుడు అతి ముఖ్యమైన పని చంద్రబాబు ముందుంది. ఏపీ బీజేపీలో పూర్తిగా టీడీపీ ప్రతికూల వర్గం ఉంది. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, ఎస్ విష్ణు రెడ్డి వంటి వారు ఈ విభాగంలో ఉన్నారు. వీరిని టిక్కెట్లలో నుంచి తప్పించడం ముఖ్యం. తమకు టిక్కెట్లు ఇస్తే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుపు కోసం పనిచేసే అవకాశం ఉంది. అలాగే, టీడీపీ ఓటర్లు తమ ఓట్లను బదిలీ చేసే అవకాశం లేదు. కాబట్టి వారికి టిక్కెట్లు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. 2014 తర్వాత టీడీపీ-బీజేపీ మధ్య చిచ్చుకు ఈ బ్యాచ్ కారణం.. అప్పటి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్‌కు సాయం చేస్తూ ప్రతిపక్షాన్ని ఆటపట్టించేందుకు ఈ నేతలు ప్రయత్నించారు. కాబట్టి చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాలి. టిక్కెట్లు రాకున్నా, గెలవకున్నా వారి వాయిస్ ఆటోమేటిక్‌గా విశ్వసనీయత కోల్పోతుంది. ఇది ప్రస్తుతం చంద్రబాబు ముందున్న మెయిన్‌ టాస్క్‌..
Read Also : AP Politics : రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరూ.. ఇదే నిదర్శనం..!