Liquor Notification : ఏపీలో మరోసారి మద్యం షాపులకు నోటిఫికేషన్

Liquor Notification : రాష్ట్రంలోని గౌడ, శెట్టి బలిజ, గౌడ్, ఈడిగ, గౌండ్ల, యాత, శ్రీశయన, శెగిడి, గామల్ల వంటి కులాలకు 10 శాతం మద్యం షాపుల లైసెన్సులను రిజర్వు చేయాలని నిర్ణయించారు

Published By: HashtagU Telugu Desk
Ap Govt New Liquor Notifica

Ap Govt New Liquor Notifica

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) గీత కార్మికులకు (Geetha workers) మద్యం షాపుల కేటాయింపు (Allotment of Liquor Shops) కోసం నూతన నోటిఫికేషన్ ( Liquor Notification) విడుదల చేయబోతుంది. రాష్ట్రంలోని గౌడ, శెట్టి బలిజ, గౌడ్, ఈడిగ, గౌండ్ల, యాత, శ్రీశయన, శెగిడి, గామల్ల వంటి కులాలకు 10 శాతం మద్యం షాపుల లైసెన్సులను రిజర్వు చేయాలని నిర్ణయించారు. మొత్తం 335 మద్యం షాపులను కేటాయించనున్నారు, వీటిలో ఉత్తరాంధ్రలోని సొండి కులస్థులకు నాలుగు షాపులు ఉండనున్నాయి.

ACB Questions : ఫార్ములా-ఈ కార్ రేసు కేసు.. ఐఏఎస్ అరవింద్ కుమార్‌‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం

ఈ షాపుల రిజర్వేషన్ కోసం ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. జిల్లాల వారీగా ఏ కులానికి ఎన్ని షాపులు కేటాయించాలో ఇప్పటికే నిర్ణయించబడింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు ప్రక్రియ ఈ నెలాఖరులో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో షాపులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రిజర్వు చేయబడిన మద్యం షాపుల కోసం లైసెన్సు రుసుము సగం తగ్గించబడింది. సాధారణ షాపుల కోసం రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు రుసుము ఉంటే, గీత కార్మికుల షాపులకు రూ.25 లక్షల నుంచి రూ.42.50 లక్షల వరకే ఉంటుంది. ఈ లైసెన్సులు 2026 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయడం తప్పనిసరి అని సూచించింది.

దరఖాస్తు ప్రక్రియలో లాటరీ విధానం ద్వారా షాపులు కేటాయిస్తారు. ఒక్క వ్యక్తికి ఒక్క షాపు మాత్రమే కేటాయించబడుతుంది. ఒకే వ్యక్తి ఒక్క షాపు లేదా వేర్వేరు షాపులకు ఏకకాలంలో అనేక దరఖాస్తులు చేసుకునే వీలుంది, కానీ ఒకదానికంటే ఎక్కువ లభించిన పక్షంలో మిగతావి రద్దు చేయబడతాయి. ఈ నిర్ణయంతో గీత కార్మికుల జీవితాల్లో ప్రగతి తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మద్యం షాపుల రిజర్వేషన్ ద్వారా వారికే ఆర్థిక మద్దతు అందించడమే కాక, స్థానిక గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

  Last Updated: 08 Jan 2025, 03:46 PM IST