Site icon HashtagU Telugu

Passbook : ఆగస్టు 15 నుంచి కొత్త పాస్ బుక్స్ పంపిణీ!

New Pass Books

New Pass Books

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) రైతులకు శుభవార్త తెలిపింది. గతంలో ఉన్న పట్టాదారు పుస్తకాల స్థానంలో కొత్తగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్స్‌(Pass Books )ను పంపిణీ చేయనుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కొత్త పాస్‌బుక్స్‌ పంపిణీ తొలి విడతగా ఆగస్టు 15 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కొంతమంది రైతులకు కొత్త పాస్‌బుక్స్‌ను ప్రభుత్వం అందించనుంది. ఈ మార్పు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, వారి భూములకు మరింత భద్రత కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

10th Class Exams : పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ఫోటోతో ఉన్న పాస్‌బుక్స్‌ను పంపిణీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ పాస్‌బుక్స్‌ స్థానంలో రాజముద్రతో కూడిన కొత్త పాస్‌బుక్స్‌ను రూపొందించింది. ఈ మార్పు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీల చిహ్నాలకు బదులుగా ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ పథకాలకు రాజకీయ రంగు పులమకుండా చూసే ప్రయత్నంగా దీనిని భావించవచ్చు. ఈ కొత్త పాస్‌బుక్స్‌ రైతుల భూమి రికార్డులను మరింత పారదర్శకంగా, సురక్షితంగా ఉంచడానికి తోడ్పడతాయి.

MP Avinash Reddy Arrest : MP అవినాశ్ రెడ్డి అరెస్ట్

ఈ కొత్త పాస్‌బుక్స్‌ పంపిణీ మొత్తం 20 లక్షల మందికి పైగా రైతులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియను దశలవారీగా చేపట్టాలని నిర్ణయించింది. మొదటి దశలో పాస్‌బుక్స్‌ అందుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాస్‌బుక్స్ తమ భూమి హక్కులకు ఒక అధికారిక గుర్తింపుగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ చర్యతో భూ రికార్డుల నిర్వహణలో సమగ్రత, పారదర్శకత పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే, ఈ కొత్త పాస్‌బుక్స్‌ పంపిణీతో రైతులు తమ భూములకు సంబంధించిన వ్యవహారాలను సులభంగా నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.