TDP : ప్రతి టీడీపీ కార్యకర్త నా కుటుంబసభ్యుడే – నారా లోకేష్

TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Lokesh) తన పార్టీ కార్యకర్తల పట్ల చూపిస్తున్న మమకారం మరోసారి వ్యక్తమైంది

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Lokesh) తన పార్టీ కార్యకర్తల పట్ల చూపిస్తున్న మమకారం మరోసారి వ్యక్తమైంది. మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త శేషగిరిరావు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఉద్రిక్తతల్లో గాయపడి, అనంతరం అస్వస్థతతో మరణించిన ఘటనపై లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులను ఉండవల్లికి ఆహ్వానించి, వారితో ప్రత్యక్షంగా మాట్లాడి, ఆప్యాయంగా ఆదరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, “టీడీపీ కార్యకర్తలంతా నా కుటుంబసభ్యులే. వారికి ఏ కష్టమొచ్చినా నేనే ముందుండి ఆదుకుంటా” అని హామీ ఇచ్చారు.

PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!

లోకేశ్ మాట్లాడుతూ.. శేషగిరిరావు త్యాగం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. “మాచర్లలో జరిగిన ఈవీఎం ధ్వంసం ఘటనలో శేషగిరిరావు ధైర్యంగా పోరాడారు. ఆయన కేవలం కార్యకర్త కాదు ,టీడీపీ ఆత్మను ప్రతిబింబించిన యోధుడు. ఇలాంటి నాయకులే ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు” అని లోకేశ్ అన్నారు. ఆయన కుటుంబానికి అవసరమైన సహాయం అందించడమే కాకుండా, విద్య, ఉపాధి పరంగా కూడా భరోసా ఇచ్చారు. పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్త వెనుక టీడీపీ ప్రభుత్వం నిలబడుతుందని స్పష్టం చేశారు.

నారా లోకేశ్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. గతంలోనూ ఆయన ప్రతి జిల్లాలోకి వెళ్లి, పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడే పద్ధతిని కొనసాగించారు. మాచర్ల ఘటన టీడీపీకి భావోద్వేగ పరంగా బాధాకరమైనప్పటికీ, దానిని స్ఫూర్తిగా మార్చి ముందుకు సాగేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా చూస్తే, ఈ చర్య ఆయనను ప్రజల మధ్యకు మరింత దగ్గర చేస్తోంది. పార్టీకి ప్రాణంగా నిలిచే కార్యకర్తల పట్ల ఇలాంటి అండదండలు టీడీపీ అంతర్గత ఐక్యతను మరింత బలపరచే అవకాశం ఉంది.

  Last Updated: 09 Oct 2025, 03:44 PM IST