టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)..వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఫై యుద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో జనసేన తో ఇప్పటికే పొత్తు పెట్టుకోగా..త్వరలో బిజెపి తో కూడా పొత్తు పెట్టుకోబోతుందని తెలుస్తుంది. ఈ తరుణంలో లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలు మంచి చేస్తుందో తెలియజేస్తుంటే..అధికార పార్టీ వైసీపీ ఫై నిప్పులు చెరుగుతున్నారు.
తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కు లోకేశ్ కోడిగుడ్డు (Nara Lokesh Egg Gift )ను గిఫ్ట్ గా ఇచ్చి వార్తల్లో నిలిచారు. ‘గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన ఆయనకు గుడ్డు గిఫ్ట్ ఇస్తున్నా. పరిశ్రమల మంత్రి నియోజకవర్గం ఎలా ఉండాలి? రోడ్లు ఉండాలి. ఉద్యోగాలు ఉండాలి. నియోజకవర్గంలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా మంత్రి గారు? ఒక్క పరిశ్రమ తెచ్చారా? 600 ఎకరాల భూమిని దోచారు. గ్రావెల్, రైతుల భూములు దోచుకున్నారు’ అని లోకేశ్ ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, విశాఖను గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని లోకేష్ ధ్వజమెత్తారు. సామాన్యుడి చైతన్య రథంలా సైకిల్ సేవలు అందిస్తుంటే, ఐదేళ్లుగా రైతులు, యువత ఆత్మహత్య చేసుకునేందుకు ఫ్యాన్ ఉపయోగపడుతోందని విమర్శించారు. విశాఖ ఉత్తరం, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగిన శంఖారావం సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో ‘శంఖారావం’ సభ నిర్వహిస్తున్నారు లోకేష్.
మంత్రి గుడివాడ అమర్నాథ్కు కోడిగుడ్డు గిఫ్ట్ ఇచ్చిన నారా లోకేష్. pic.twitter.com/Z5Ui0jrmbC
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2024
Read Also : Election Schedule 2024 : మార్చి 9 తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్.. డేట్స్ ఫిక్స్ !