స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో ఆరోపణలు ఎదురుకుంటూ గత 49 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన భద్రత, ఆరోగ్యంపై (Health And Security) అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ జడ్జి (ACB Court Judge)కి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
‘‘తనకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉన్నప్పటికీ.. జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు.. ఫొటోలు తీయడం..వాటిని పబ్లిసిటీ చేయడం.. నా రెప్యూటేషన్ను దెబ్బ తీసేందుకే కుట్ర చేయడం వంటివి లేఖలో ప్రస్తావించారు. అలాగే తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని , రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసిందని.. దీనికి సంబంధించిన లేఖను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఈ విషయమై లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని బాబు లేఖ లో పేర్కొన్నారు.
అలాగే జైల్లో డ్రగ్స్ కేసు నిందితుడు పెన్ కెమెరాతో తిరుగుతున్నాడు. ఆ ఖైదీ జైలు లోపల ఫొటోలు తీస్తున్నాడు. ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ఎగురవేశారు. నా కదలికలు తెలుసుకునేందుకు డ్రోన్ వాడారు. ములాఖత్లో నన్ను కలిశాక వారి చిత్రాల కోసం డ్రోన్ ఎగురవేశారు. నాతోపాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. జైలుపై డ్రోన్ ఎగురవేసింది వైసీపీ వారేనని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేసారు. అంతే కాకుండా కొందరు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారు. గార్డెనింగ్ విధుల్లోని ఖైదీలు వాటిని పట్టుకున్నారు. రాజమహేంద్రవరం జైల్లో మొత్తం 2,200 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 750 మంది డ్రగ్స్ కేసు నిందితులు. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. జడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న నా భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు” అంటూ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే గత నాలుగున్నరేళ్లలో (4%) అధికార పార్టీ కార్యకర్తలు తమ నాయకుల ఉదంతంతో మరియు పోలీసుల బహిరంగ మద్దతుతో వ్యతిరేకతను బహిర్గతం చేయడానికి నేను వివిధ ప్రదేశాలను సందర్శించినప్పుడు నాపై భౌతికంగా అనేకసార్లు దాడికి ప్రయత్నించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి యొక్క ప్రజలు మరియు అరాచక విధానాలు. ప్రస్తుత ప్రభుత్వం మరియు అధికార పార్టీ నాయకుల చర్యల కారణంగా నా భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందనే వాస్తవాన్ని వివరించడానికి ఇక్కడ అనేక ఉదాహరణలు ఉన్నాయని బాబు తెలుపడం జరిగింది.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 25-6-2019 నుండి అమలులోకి వచ్చే నా ప్రస్తుత సెక్యూరిటీని తగ్గించింది. గౌరవనీయులైన హైకోర్టు జోక్యంతో 25-06-2019కి ముందు ఉన్న నా భద్రత మాత్రమే పునరుద్ధరించబడింది. 28-11-2019న, నేను రాజధాని నగర ప్రాజెక్టు అమరావతి పర్యటనను చేపట్టాను. అధికార పార్టీ శ్రేణులు నా బస్సుపై రాళ్లు రువ్వడం, చప్పుళ్లు, ఇతర వస్తువులు విసిరారు. అధికార పార్టీ కేడర్ ప్రజాస్వామిక అసమ్మతిని తెలియజేసే ఘటనగా డిజిపి సిగ్గులేకుండా ఈ ఘటనను అభివర్ణించారు.
4-11-2022న నేను ఎన్టీఆర్ జిల్లా, నందిగామను సందర్శించినప్పుడు, విద్యుత్ను నిలిపివేసి నన్ను లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసిరారు మరియు నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CSO) గాయపడ్డారని లేఖలో పేర్కొన్నారు. 21-4-2023న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో బహిరంగ సభలో ప్రసంగించడానికి పర్యటనకు వెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. ఇలా చంద్రబాబు ఫై జరిగిన అనేక దాడులు , కుట్రదారులు వేసిన ప్లాన్ లను లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు లెటర్ లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు కుటుంబ సభ్యులను , టీడీపీ శ్రేణులను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ఇదే విషయాన్నీ నారా బ్రహ్మణి ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. చంద్రబాబు ఏమైతే లేఖలో పేర్కొన్నారో వాటిని క్లుప్తంగా బ్రాహ్మణి షేర్ చేయడం జరిగింది.
Praying for @ncbn garu's safety as he navigates his time in prison. The letter he wrote, detailing the security concerns, has left us deeply worried. #FalseCasesAgainstNaidu #CBNLifeUnderThreat pic.twitter.com/DNdT9mt5cN
— Brahmani Nara (@brahmaninara) October 27, 2023