Site icon HashtagU Telugu

MP Purandeswari: రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన పురందేశ్వరి

MP Purandeswari

MP Purandeswari

MP Purandeswari: తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాగంటి మురళీమోహన్‌, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి నిర్మాణంలో మాజీ ఎంపీ మురళీమోహన్‌ చేస్తున్న కృషిని ఎంపీ పురందేశ్వరి ప్రస్తావించారు.

మోరంపూడి ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ఘనత మురళీమోహన్ అని పురందేశ్వరి అన్నారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ బ్రిడ్జి నిర్మాణ క్రెడిట్‌ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రచార ఫలకాలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె విమర్శించారు. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజల వినియోగానికి ప్రారంభిస్తామని ఎంపీ పురందేశ్వరి హామీ ఇచ్చారు.

మాజీ ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ.. మోరంపూడి సెంటర్‌లో జరిగిన ప్రమాదాల సమస్యను అప్పటి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి ఎంపీగా ఉన్న సమయంలో బ్రిడ్జి నిర్మాణానికి మంజూరయ్యి విజయవంతం చేశామన్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌కు ఆపాదించడం తప్పుదోవ పట్టించే లక్షణాన్ని నొక్కిచెప్పిన ఆయన, వంతెన అభివృద్ధికి తన ప్రయత్నాలే కారణమని పునరుద్ఘాటించారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పురోగతిని పర్యవేక్షించడంలో మాజీ ఎంపీలు మరియు ఎమ్మెల్యేల సమిష్టి కృషి ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల వారి అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది.

Also Read: Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు రూ. 50 లక్షల జరిమానా విధించిన హైకోర్టు