అనంతపురం అర్బన్ నియోజకవర్గం(Anantapur Urban Constituency)లో తెలుగుదేశం పార్టీ(TDP)లో తీవ్ర అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్(MLA Daggubati Venkateswara Prasad) అనుచరులు, అదే పార్టీకి చెందిన మరో నేత సుధాకర్ నాయుడు (Sudhakar Naidu)తో వివాదాలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో సుధాకర్ నాయుడు దగ్గుబాటి విజయానికి పనిచేసినప్పటికీ, ఇటీవల పార్టీ స్థాయిలో ఆయనకు తగ్గ గుర్తింపు లేకపోవడమే కాకుండా, ఎమ్మెల్యే అనుచరులు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో విభేదాలు ఉధృతంగా మారాయి. దీనిపై సుధాకర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని అనంతపురం ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు.
Vishal : హీరో విశాల్ కు బిగ్ షాక్.. రూ.21 కోట్లు చెల్లించాలన్న మద్రాస్ హైకోర్టు
ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఎస్పీ అత్యంత గోప్యతతో విచారణ చేపట్టి, ఇద్దరు నేతల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఎమ్మెల్యే అనుచరులు “సుధాకర్ను చంపేస్తాం” అంటూ బెదిరింపులకు దిగారని పేర్కొనడంతో పార్టీ లోపల ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఇద్దరు నేతలను పిలిపించి వివరణ తీసుకున్నట్లు సమాచారం. ఈ వివాదం పరిష్కార బాధ్యతను పార్టీ సీనియర్ నాయకుడు కోవెలపూడి రవీంద్రకు అప్పగించినట్టు తెలుస్తోంది.
Fake Gold: నకిలీ బంగారు ఆభరణాలను కుదవ పెట్టి రూ. 43 లక్షల లోన్
2024 ఎన్నికల సమయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గం టికెట్ కోసం వైకుంఠం ప్రభాకర్ చౌదరి, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సుధాకర్ నాయుడు ముగ్గురు ఆసక్తి కనబర్చారు. చివరికి టికెట్ దగ్గుబాటికి ఇవ్వడం వలన అప్పటినుంచి వర్గ పోరు మొదలైందని తెలుస్తోంది. మొదట్లో పార్టీ విజయంకోసం అంతా కలిసి పనిచేసినప్పటికీ, అనంతరం ఎమ్మెల్యే అనుచరుల అధికారం పెరగడం, పార్టీకి నిజంగా కృషి చేసిన వారిని విస్మరించడం వల్ల అసంతృప్తి పెరిగింది. నేతల మధ్య ఉన్న ఈ విభేదాలు ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారగా, నియోజకవర్గ ప్రజలలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది.