ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జగనన్న గోల్డెన్ జూబ్లీ కల్చరల్ ఫెస్టివల్లో చురుగ్గా పాల్గొంటూ ఎనర్జీ నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా వేదికపై ఇతర డ్యాన్సర్లతో కలిసి నాగరాజు పాటకు డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గత కొద్ది రోజులుగా మంత్రి రోజా ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొంటూ కళాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర సంస్కృతుల పరిరక్షణే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు మంత్రి రోజా డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. రోజా డాన్స్ చేయడాన్ని వైసీపీ నేతలు స్వాగతిస్తే, టీడీపీ నాయకులు మాత్రం ఈ ఉత్సాహం విధుల్లో చూపించాలని సెటైర్స్ వేస్తున్నారు.
ఎందరో మహానుభావులు వారందరూ కళాకారులే, కళామ్మతల్లి ముద్దు బిడ్డలే వారందరికీ వందనాలు 🙏 రండి తరలిరండి గుంటూరులో మూడు రోజుల పాటు జరుగుతున్న `జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు` కి ఇదే మా ఆహ్వానం…!!@RojaSelvamaniRK @ysjagan #YSJaganMarkGovernance pic.twitter.com/XTY5SHJnFn
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 24, 2022