Site icon HashtagU Telugu

Group 2 : గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై మంత్రి లోకేష్ రియాక్షన్

Minister Lokesh

Minister Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 (Group 2)అభ్యర్థులు (Candidates) తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో 899 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రోస్టర్ విధానాన్ని అమలు చేయకపోవడం అభ్యర్థుల అసంతృప్తికి కారణమైంది. ఈ న్యాయపరమైన సమస్యల కారణంగా అభ్యర్థులు కోర్టుకు కూడా వెళ్లగా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయిన తర్వాత మెయిన్స్ పరీక్ష జరగడానికి కేవలం ఒక రోజు ముందు, ఈ సమస్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించడం అభ్యర్థుల్లో కొంత వరకు ఊరటనిచ్చింది.

Vizag Steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ .. 14 రోజుల డెడ్ లైన్..!

గ్రూప్-2 అభ్యర్థుల నుంచి అనేక మంది తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా, ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ సమయంలోనే అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేసినా, అప్పటి ప్రభుత్వం దీనిపై సరైన నిర్ణయం తీసుకోలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మెయిన్స్ పరీక్షను వాయిదా వేసి రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నారా లోకేష్ ఈ సమస్యను పరిష్కరించేందుకు తన లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నామని, త్వరలోనే తగిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు మంత్రి లోకేష్‌ ప్రకటనపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని రోస్టర్ విధానాన్ని సవరించే అవకాశం ఉందా? లేదా మునుపటి విధంగానే పరీక్షలు కొనసాగుతాయా? అనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. గ్రూప్-2 అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. లోకేష్ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వం చొరవ తీసుకుంటే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.